దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 240 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 1, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,86,611 కు చేరుకుంది. కరోనా వలన మరో మరణం (రాజస్థాన్ లో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,772కి పెరిగింది. కాగా ఫిబ్రవరి 28న 1,14,446 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా నమోదైంది.
దేశంలో 2,335 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:
దేశంలో ప్రస్తుతం 2,335 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 161 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,53,504 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (52), కర్ణాటక (49), మహారాష్ట్ర (35), హిమాచల్ ప్రదేశ్ (19), తెలంగాణ (18) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE