సోమవారం ఒకవైపు గుజరాత్లో చివరి దశ పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అప్పుడే తమ తదుపరి కార్యాచరణకు మేథోమథనం చేయనుంది. ఈ క్రమంలో బీజేపీ రెండు రోజుల జాతీయ బీజేపీ పదాదికారుల (ఆఫీస్ బేరర్ల) సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఇక ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో 2023లో జరుగనున్న ఎన్నికలకు సన్నాహాలు, వ్యూహాలపై సమావేశంలో ప్రధనంగా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర కీలక రాష్ట్రాలతో పాటు పలు ముఖ్యమైన ఎన్నికలను పార్టీ పరిశీలిస్తోంది.
అలాగే ఫిబ్రవరిలో త్రిపుర, నాగాలాండ్ మరియు మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల మూడు అసెంబ్లీలకు వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం మే నెలలో, దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇది బీజేపీకి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే 2018లో మొదట్లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం బీజేపీని ఓడించింది. పార్టీ చివరకు ఇతర పార్టీల నుండి ఫిరాయింపుదారుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది, అయితే పార్టీలో అంతర్గత పోరాటాలతో పోరాడుతోంది. దీంతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న బలమైన నేత యడ్యూరప్పను కూడా మార్చి బసవరాజ్ బొమ్మైని సీఎంను చేసింది. ఇక వచ్చే ఏడాది చివరిలో.. నవంబర్-డిసెంబరులో బీజేపీకి అసలైన యుద్ధం ప్రారంభమవుతుంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఎందుకంటే 2018లో అవి నరేంద్ర మోడీ మరియు అమిత్ షా వ్యూహాలను ఎదుర్కొని కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చింది. అయితే అనంతరం బీజేపీ మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లలో రకరకాల ప్రయత్నాల ద్వారా తిరిగి అధికారాన్ని పొందగలిగింది. కాంగ్రెస్ విధేయుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు సహాయంతో మధ్యప్రదేశ్లో బిజెపి విజయవంతంగా తిరిగి అధికారంలోకి రాగలిగింది. అలాగే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సచిన్ పైలట్ రూపంలో తిరుగుబాటు భయం వెంటాడుతోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE