భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదవగా, 3780 మంది మరణించారు. దీంతో మే 5, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,06,65,148 కు, మరణాల సంఖ్య 2,26,188 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 3,38,439 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 1,69,51,731 కు చేరుకుంది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 82.03 శాతం గానూ, మరణాల రేటు 1.09 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 34,87,229 (16.87%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ