దేశంలో రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) కింద దేశంలో అర్హత కలిగిన రైతు లబ్దిదారులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగునెలలకోసారి మూడు సమానమైన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద మరో విడత రూ.2000 సాయాన్ని రైతుల ఖాతాల్లో డిసెంబర్ 25, శుక్రవారం నాడు జమ చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇందుకు అవసరమయ్యే నిధులను 25న తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా ఉన్న రైతులకు మరో విడత పీఎం కిసాన్ ఆర్థిక సాయం కోసం రూ.18,000 కోట్లకుపైగా నిధులను ప్రధాని మోదీ నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
అలాగే ఈ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా దేశంలోని ఆరు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సంభాషించనున్నారు. రైతులు తమ సాధకబాదకాలను ఈ సందర్భంగా ప్రధానితో పంచుకోనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సహా రైతు సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన ఇతర చర్యలపై రైతులు తమ అనుభవాలను ప్రధాని తెలుసుకోనున్నారు. ప్రధాని మోదీతో పాటుగా ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ