ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం డెహ్రాడూన్లోని సీఎం నివాసంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీని, మెమెంటోను సీఎం ఆయనకు బహూకరించారు. అనంతరం అక్షయ్ కుమార్ ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తారని సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. అక్షయ్ కుమార్ కు ఒక ప్రతిపాదన చేశామని, అతను దానిని అంగీకరించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతను చైతన్యవంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అక్షయ్ కుమార్ ప్రశంసించారని మరియు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ