యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23, బుధవారం నుంచి జనవరి 2, శనివారం వరకు రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది.
రాత్రిపూట కర్ఫ్యూ సమయంలో 10 గంటల తరువాత ఫంక్షన్స్ లేదా వేడుకలు జరపడానికి అనుమతి లేదని, అలాగే అవసరమైన సేవలను మినహాయించి వాహనాల రాకపోకలు కూడా అనుమతించబడవని పేర్కొన్నారు. కేంద్రం సహా కోవిడ్ కమిటీలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కర్ణాటక ప్రభుత్వం కోరింది. కొత్తరకం కరోనా వైరస్ నివారణ, నియంత్రణకు నైట్ కర్ఫ్యూ విధించామని, రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులు అందరిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ