మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15, బుధవారం నాడు 4,024 కరోనా కేసులు, 2 మరణాలు నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 79,19,442కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,47,877 గా ఉంది. ఇక కొత్తగా కరోనా నుంచి 3028 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 77,52,304 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.89 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.86 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 19,261 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా ముంబయిలో అత్యధికంగా 12341 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 3611, పుణేలో 1344, రాయగడ్ లో 646, పాల్గర్ లో 556 కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 8,14,28,221 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY