ప్రధాని నరేంద్ర మోదీ జూలై 15, గురువారం నాడు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.744 కోట్ల విలువైన పలుఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, దాదాపు 839 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ)లోని ఎంసీహెచ్లో 100 బెడ్స్ విభాగాన్ని ప్రారంభించనున్నారు. గొదౌలియాలో మల్టీలెవెల్ పార్కింగ్, గంగా నది పర్యటన అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న రో-రో వెస్సెల్స్, వారాణసి ఘాజీపుర్ హైవేలో మూడు లేన్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిఐపిఇటి) కి చెందిన సెంటర్ ఫర్ స్కిల్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్ కు, జల్ జీవన్ మిషన్ లో భాగంగా చేపట్టే 143 గ్రామీణ పథకాలు, కర్ఖియాన్విలో మ్యాంగో, వెజిటబుల్ సమీకృత ప్యాక్ హౌస్ లకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాలకు జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్’ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం బీహెచ్యూలో మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని తనిఖీ చేయనున్నారు. అలాగే కోవిడ్ పై సన్నద్ధతను సమీక్షించడం కోసం అధికారులతోను, వైద్యరంగ నిపుణులతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ