ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, గురువారం నాడు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమై, ఆగస్టు 13న ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, పార్లమెంట్ లో ప్రస్తావించేలా లోక్సభ, రాజ్యసభ ఎంపీలుకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ