టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందించారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశం అనంతరం మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈటలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచనని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తానూ మోసపోతూ, ప్రజలను కూడా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌరవమిచ్చిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని, పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలన్నారు. అలాగే కేబినెట్ మంత్రిగా ఉంటూనే కేబినెట్ నిర్ణయాలను తప్పుబట్టారని చెప్పారు. ఐదేళ్ల క్రితమే ఈటల ఆత్మగౌరవం దెబ్బతింటే ఎందుకు మంత్రిగా కొనసాగారు? అని ప్రశ్నించారు.
గత ఐదేళ్లుగా ఈటల ఎలా మాట్లాడినా సీఎం కేసీఆర్ మంత్రిగా ఉంచారని, ఈటలను టీఆర్ఎస్ పార్టీలోకొనసాగేలా చివరివరకు ప్రయత్నించానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, ఏ ఎన్నికైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందిగాని, వ్యక్తుల మధ్య కాదని అన్నారు. మరోవైపు బండి సంజయ్ చేయబోయే పాదయాత్రపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అన్యాయం చేశామని పాదయాత్ర చేపడుతున్నారని అని ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ