పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో నియంత్రణ చర్యల్లో భాగంగా గత కొన్ని రోజులుగా వారానికి రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి వారంలో రెండు రోజుల పూర్తిస్థాయి లాక్డౌన్ను ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఆగస్టు నెలలో 2, 5, 8, 9, 16, 17, 23, 24, 31 తేదీల్లో మొత్తం 9 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు కానుంది. ఆగస్టు 1న బక్రీద్ నేపథ్యంలో ఎలాంటి లాక్డౌన్ ఉండదని సీఎం మమత బెనర్జీ తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60830 కి చేరుకుంది. వీరిలో 39917 మంది కరోనా నుంచి కోలుకోగా, 19,502 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన ఇప్పటివరకు 1411 మంది మృతి చెందారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu