ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. ఎయిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న పంజాబ్ కు చెందిన సిస్టర్ నిశా శర్మ భారత్ బయోటెక్కు చెందిన “కొవాగ్జిన్” వ్యాక్సిన్ యొక్క రెండో డోసును ప్రధాని మోదీకి ఇచ్చారు. అనంతరం తాను కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ రోజు ఎయిమ్స్లో రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను. వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ ను ఓడించడానికి మనకు ఉన్న కొన్ని మార్గాలలో ఒకటి. మీరు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయితే వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. ఇందుకోసం Http://CoWin.gov.in లో నమోదు చేసుకోండి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరోవైపు మార్చి 1 వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోనే ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ