ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 2558 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 8, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,15,832 కు చేరింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 465, గుంటూరు జిల్లాలో 399, కర్నూలులో 344, విశాఖపట్నంలో 290 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 915 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7268 కి పెరిగింది. గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,53,33,851 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 8, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,15,832
- కొత్తగా నమోదైన కేసులు : 2558
- కొత్తగా నమోదైన మరణాలు : 6
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,93,651
- యాక్టీవ్ కేసులు : 14913
- మొత్తం మరణాల సంఖ్య : 7268
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ