ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (మే 28, శనివారం) గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు రాజ్కోట్లోని అత్కోట్లో కొత్తగా నిర్మించిన మాతుశ్రీ కె.డి.పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. అనంతరం ఆ వేదిక వద్ద జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు గాంధీనగర్ లోని మహాత్మా మందిర్లో ‘సహకార్ సే సమృద్ధి’పై వివిధ సహకార సంస్థల నాయకుల సెమినార్లో ప్రధాని ప్రసంగిస్తారు.
గుజరాత్ సహకార రంగంలో 84,000 కంటే ఎక్కువ సంఘాలు ఉండగా, దాదాపు 2.31 కోట్ల మంది సభ్యులు ఈ సొసైటీలతో అనుబంధం కలిగి ఉన్నారు. రాష్ట్రంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ‘సహకార్ సే సమృద్ధి’పై సెమినార్ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ సహకార సంస్థల నుంచి 7,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సెమినార్లో పాల్గొంటారు. ఈ సెమినార్ లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. అలాగే కలోల్ లోని ఇఫ్కోలో దాదాపు రూ.175 కోట్లతో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నానో యూరియా వాడకం ద్వారా పంట దిగుబడి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అల్ట్రామోడర్న్ నానో ఫర్టిలైజర్ ప్లాంట్ స్థాపించబడిందని, ఈ ప్లాంట్ రోజుకు 500 మిల్లీలీటర్ల 1.5 లక్షల బాటిళ్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF