రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రకృతి అందాలతో ఆశీర్వదించబడిన ఈ రాష్ట్రంలోని కష్టజీవులు ఎల్లప్పుడూ దేశసేవకు అంకితమై ఉంటారు. రాబోయే కాలంలో వారు విజయాల కొత్త శిఖరాలను చేరుకోవాలి, ఇదే నా కోరిక” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేస్తూ, “హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘దేవ్ భూమి’ హిమాచల్ ప్రదేశ్ దాని ప్రత్యేక ప్రకృతి సౌందర్యానికి మరియు అనేక పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. పర్యావరణం మరియు అభివృద్ధిని సమతుల్యం చేయడం ద్వారా ఈ హీరోల భూమి (ల్యాండ్ ఆఫ్ హీరోస్) పురోగతి యొక్క శిఖరాగ్రానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE