భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20, వన్డే సిరీస్ లలో తలపడే భారత్ జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం నాడు ప్రకటించింది. అయితే టీ20 సిరీస్ కు ప్రత్యేకంగా బీసీసీఐ రెండు జట్లను ప్రకటించడం విశేషం. వన్డేలకు, టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక 17 మందితో కూడిన వన్డే జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్ళీ చోటు దక్కించుకున్నాడు.
మొదటి టీ20కి భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
2వ మరియు 3వ టీ20 కోసం భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.
3 వన్డేలకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY