రజనీకాంత్‌ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

2021 51st Dadasaheb Phalke Award, 2021 Dadasaheb Phalke Award, 51st Dadasaheb Phalke Award, 51st Dadasaheb Phalke Award 2021, 51st Dadasaheb Phalke award for Rajinikanth, Mango News, Rajinikanth, Rajinikanth to be conferred with 51st Dadasaheb Phalke, Rajinikanth to be honoured with 51st Dadasaheb Phalke Award, Super Star Rajinikanth, Super Star Rajinikanth To Be Conferred With 51st Dadasaheb Phalke Award, Superstar Rajinikanth

అభిమానుల ఆరాధ్య నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి గాను రజనీకాంత్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవడేకర్ గురువారం ఉదయం ట్విట్టర్లో ప్రకటించారు. భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరైన రజనీకాంత్, నటుడుగా, నిర్మాతగా మరియు స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషి విలక్షణమైనదని కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ పేర్కొన్నారు.

1969వ సంవత్సరం నుంచి సినీ పరిశ్రమకు గొప్ప సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోబోతున్న 51వ వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. ర‌జ‌నీకాంత్ ను దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీలో మోహ‌న్‌లాల్‌, ఆశా భోస్లే, సుభాష్ ఘాయ్, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, బిశ్వ‌జీత్ ఛటర్జీ వంటి ప్రముఖులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =