దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు, దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ