తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని డీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద డీఎంకే కార్యకర్తలు పటాసులు పేల్చి, మిఠాయిలు పంచి వేడుకలు చేసుకున్నారు. ఎన్నికలలో డీఎంకే సత్తా చాటడంతో కార్యకర్తలు పార్టీ అధినేత నాయకత్వాన్ని కొనియాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. గత ఏడాది అసెంబ్లీ విజయం తర్వాత డిఎంకె మళ్ళీ పూర్తి స్థాయి ఎన్నికలలో ఘనవిజయం సాధించింది.
తమిళనాడు లో డీఎంకే ఘనవిజయం నమోదు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ను డిఎంకె స్వతంత్రంగా గెలుచుకోవడం సంతోషంగా ఉంది. ఈ విజయం అందించిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తొమ్మిది నెలల సుపరిపాలనకు ఇది సర్టిఫికేట్, ఇది ద్రవిడ మోడల్కు లభించిన గుర్తింపు. హామీలను నెరవేరుస్తున్నాం. ప్రజలు మాపైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము అని స్టాలిన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ