తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. 6వ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం భోపాల్ వేదికగా 50 కేజీల విభాగంలో జరిగిన మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రైల్వేస్ బాక్సర్ అనామికపై 4-1తో విజయం సాధించింది. ఫైనల్లో నిఖత్ ప్రత్యర్థి అనామిక కేవలం ఒక బౌట్ లో మాత్రమే గెలిచింది. ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నిఖత్ జరీన్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను (2022 ఎడిషన్) సొంతం చేసుకుంది. కాగా గత ఎడిషన్ (2021)లో నిఖత్ జరీన్ 52 కేజీల విభాగంలో టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఏడాది ఆసాంతం మేజర్ టోర్నమెంట్స్ లో అపజయం లేకుండా నిఖత్ జరీన్ 2022 సంవత్సరాన్ని ఘనంగా ముగించింది. 2022లో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్, కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్, స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ తో పాటుగా తాజాగా జాతీయ ఛాంపియన్షిప్ ను నిఖత్ జరీన్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాదిలో వరుస విజయాలతో పాటుగా, తాజాగా 6వ ఎలైట్ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ లో టైటిల్ సాధించిన నిఖత్ జరీన్ కు పలువురు ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE