నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు

AP Kapunadu Meeting To be Held in Visakhapatnam Today Several Kapu Leaders will Attend Beyond The Parties,AP Kapunadu Meeting,Kapunadu Meeting in Visakhapatnam,Kapu Leaders will Attend Beyond,Mango News,Mango News Telugu,Kapunadu Mahasabha,Kapunadu In Visakhapatnam,Ganta Srinivas Rao Kapunadu,Kapunadu Ganta Srinivas Rao Calls For Success,TDP MLA Ganta Srinivasa Rao,Ganta Srinivasa Rao Intresting Comments,MLA Ganta Srinivasa Rao Intresting Comments,Ganta Srinivasa Rao On Party Change,Ap Cm Ys Jagan Mohan Reddy,Tdp Party, Ysr Congress Party,Janasena Party,Andhra Pradesh,Ap Politics,Ap Political News And Updates,Ap Cm Jagan Srikakulam Tour,Jagan Tour Latest News And Updates,AP Latest News and Updates,Andhra Pradesh Politics News and Live Updates,Andhra Pradesh News,Andhra Pradesh Latest News,YSRTP Chief YS Sharmila

ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా – రంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్‌ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలలోని కాపు నేతలు హాజరుకానున్నారు. ఇక ఈ సభలో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని పొందే దిశగా సమాలోచనలు చేయనున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలోని కాపు నాయకులు హాజరవనున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు ప్రధానాకర్షణగా నిలవనున్నారు. ఇక ఈ సభ కోసం నిర్వాహకులు విశాఖలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు దీనికి నాయకత్వం వహించనున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఆయన దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగవీటి రంగా బడుగు, బలహీన వర్గాల నాయకుడని, ఏ ఒక్క కులానికో, ప్రాంతానికో ఆయనను పరిమితం చేయడం తగదని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కాపు నేతలు ఈ సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా కాపు నేతల ఐక్యతను చాటిచెప్పాలని సాటి కాపు సోదరులను కోరుతున్నానని తెలిపారు. కాగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ మాత్రం ఈ కాపునాడు సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 9 =