దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కనీస మద్దతు ధర పెంపు వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు.
2021-22 ఖరీఫ్ సీజన్ పంటల కనీస మద్దతు ధరలు ఇవే :
- వరి ధాన్యం (కామన్) క్వింటాల్ కు రూ.72 పెంపు – ధర రూ.1940
- వరి ధాన్యం (గ్రేడ్-ఏ) క్వింటాల్ కు రూ.72 పెంపు – ధర రూ.1960
- జొన్నలపై (హైబ్రిడ్) క్వింటాల్కు రూ.118 పెంపు – ధర రూ.2738
- జొన్నలపై (మాల్ దండి) క్వింటాల్కు రూ.118 పెంపు – ధర రూ.2758
- సజ్జలపై క్వింటాల్కు రూ.100 పెంపు – ధర రూ.2250
- రాగులపై క్వింటాల్కు రూ.82 పెంపు – ధర రూ.3377
- మొక్కజొన్నలపై క్వింటాల్కు రూ.20 పెంపు – ధర రూ.1870
- కందులపై క్వింటాల్కు రూ.300 పెంపు – ధర రూ.6300
- పెసలపై క్వింటాల్కు రూ.79 పెంపు – ధర రూ.7275
- మినుములుపై క్వింటాల్కు రూ.300 పెంపు – ధర రూ.6300
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ