కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రతరం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. అగ్నిపథ్ పథకంపై తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, మరియు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ బీఎస్ రాజు హాజరయ్యారు. ముఖ్యంగా అగ్నిపథ్ పై యువత వ్యతిరేకిస్తున్న విషయాలు, యువత సందేశాలను నివృత్తి చేసే మార్గాలు, ఉద్రిక్తతలను తగ్గించడం, అగ్నిపథ్ పథకాన్ని దేశంలో త్వరగా, సమర్ధవంతంగా అమలు చేయడం సహా పలు చోటుచేసుకున్న ఆందోళనలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY