దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కోవిడ్-19 సదుపాయాలను పెంచడంతో పాటుగా, వారి ప్రయత్నాలకు అనుబంధంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం వైద్య సామాగ్రిని ఉచితంగా అందిస్తోంది. మార్చి 11, 2020 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 3.04 కోట్లకు పైగా ఎన్-95 మాస్కులను, 1.28 కోట్లకు పైగా పీపీఈ కిట్లను రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితో పాటుగా 10.83 కోట్లకు పైగా హైడ్రోక్లోరోక్విన్ (హెచ్.సి.క్యూ.) టాబ్లెట్స్ ను కూడా వారికి పంపిణీ చేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 22,533 మేక్ ఇన్ ఇండియా వెంటిలేటర్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని, వాటిని ఆయా ప్రాంతాల్లో నెలకొల్పి, పనిచేసే విధంగా చూసే బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం వహిస్తోందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu