దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 129 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 11,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,08,140 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 311 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,59,191 కి పెరిగింది. ప్రస్తుతం 1,51,209(0.44%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులు 252 రోజుల తర్వాత మళ్ళీ కనిష్ఠానికి చేరుకున్నాయి.
గత 24 గంటల్లో కేరళ (6444), మహారాష్ట్ర (1078), తమిళనాడు (973), వెస్ట్ బెంగాల్ (862), మిజోరాం (638), ఒడిశా (327), అస్సాం (270), ఆంధ్రప్రదేశ్ (259), కర్ణాటక (239) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 14,159 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,36,97,740 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.22 శాతంగానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ