తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 13, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 88,396 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 22,046 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 356, మేడ్చల్ లో 168, రంగారెడ్డిలో 134, సంగారెడ్డిలో 90, వరంగల్ అర్బన్ లో 74, కరీంనగర్ లో 73, నల్గొండలో 73, ఖమ్మంలో 71, సిద్ధిపేటలో 63, నిజామాబాద్ లో 63, పెద్దపల్లిలో 54, వరంగల్ రూరల్ లో 54, జోగులాంబ గద్వాల్ లో 51, మహబూబ్ నగర్ లో 48, సూర్యపేటలో 47, కామారెడ్డిలో 44, వనపర్తిలో 41, జగిత్యాలలో 40, మెదక్ లో 39, మహబూబాబాద్ లో 38, జనగామలో 38, నిర్మల్ లో 37, భద్రాద్రి కొత్తగూడెంలో 34, రాజన్న సిరిసిల్లలో 33, ఆదిలాబాద్ లో 28, నాగర్ కర్నూల్ లో 26, జయశంకర్ భూపాలపల్లిలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 13, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 7,11,196
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 88,396
- కొత్తగా నమోదైన కేసులు : 1921
- నమోదైన మరణాలు : 9
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 64,284
- కరోనా రికవరీ రేటు: 72.72%
- యాక్టీవ్ కేసులు: 23,438
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 16,439
- మొత్తం మరణాల సంఖ్య : 674
- కరోనా మరణాల రేటు: 0.76%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu