అన్లాక్ 4.0 లో భాగంగా కంటైన్మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రాంతాల్లో మెట్రోరైళ్లు, ఓపెన్ థియేటర్స్, 100 మందితో సమావేశాల నిర్వహణ, 9 నుండి 12 తరగతుల విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడం వంటి పలు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 30 తో అన్లాక్ 4.0 గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 5.0 మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే అన్లాక్ 5.0 ప్రక్రియలో సినిమా థియేటర్స్ తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా సీటు విడిచి సీటులో కూర్చునే విధంగా నిబంధనలు విధించనున్నట్టు సమాచారం.
ఇక అన్లాక్ 5.0 లో పాఠశాలలు, కాలేజీలు పూర్తిస్థాయిలో ప్రారంభించే అంశంపై కీలక నిర్ణయం వెలువడనుంది. పాఠశాలలు, కాలేజీలు ప్రారంభించేందుకు అనుమతించి, సెక్షన్స్/ క్లాసుల వారీగా విద్యార్థులు హాజరయ్యే విధంగా నిబంధనలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అన్లాక్ 5.0 మార్గదర్శకాలను ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత రానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu