కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె మార్చి 2న ఢిల్లీలోని సర్ గంగారాం సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై సర్ గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డిఎస్ రాణా ఒక ప్రకటన చేశారు. “యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ జ్వరం కారణంగా 2023 మార్చి 2న ఆసుపత్రిలో చేరారు. డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు బృందం ఆమెను పర్యవేక్షిస్తూ, చికిత్స అందిస్తుంది. ఆమెకు పరిశీలన మరియు చికిత్సకు సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది” అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత జనవరిలో కూడా సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం సర్ గంగారాం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE