సివిల్ సర్వీసెస్-2020 ఫైనల్ ఫలితాలను సెప్టెంబర్ 24, శుక్రవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఏ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ లలో ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ కోసం మొత్తం 2,046 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడ్డారు.
ఇంటర్వ్యూ అనంతరం తాజాగా మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. 263 మంది జనరల్, 86 మంది ఈడబ్ల్యూఎస్, 229 మంది ఓబీసీ,122 మంది ఎస్సీ, 61 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నట్టు తెలిపారు. ఫైనల్ జాబితాను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచారు. సివిల్ సర్వీసెస్-2020 లో శుభమ్ కుమార్ మొదటి ర్యాంకు, జాగ్రతి అవస్థీ రెండో ర్యాంకు, అంకిత జైన్ మూడవ ర్యాంకు సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ