తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 24, శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రారంభమయిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో కూడా సీఎం కేసీఆర్ పాల్గొని అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారుపై చర్చించారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అలాగే సెప్టెంబర్ 26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో సీఎం సమావేశమై చర్చించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 26న సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ