ఇండియాలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్ టాటా తర్వాత రూ.20 లక్షల కోట్ల వ్యాపారాన్ని ఎవరు ముందుకు తీసుకెళతారు..? అసలు ఆ సామర్థ్యం ఎవరికి ఉంది..? అనే విషయం చాన్నాళ్లుగా చర్చనీయాంశంగానే ఉంది.
అయితే టాటాలకు చెందిన మల్టీ మిలియన్ కంపెనీని ముందుకు నడిపే సత్తా ఒక మహిళకు ఉందని, ఆమె రతన్ టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలదని తెలుస్తోంది. టాటా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంలో మాయా టాటా ఒకరుగా ఉన్నారు. 34 ఏళ్ల మాయా టాటా ఇటీవలే టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. మాయాతోపాటు తోబుట్టువులు లేహ్, నెవిల్లేలు రతన్ టాటా కింద తయారయ్యారు.
మాయా టాటా.. నోయెల్ టాటా, ఆలూ మిస్త్రీల కుమార్తె. నోయెల్ టాటా.. రతన్ టాటాకు కజిన్ బ్రదర్. ఆలూ మిస్త్రీ దివంగత బిలియనీర్ పల్లోంజి మిస్త్రీ కుమార్తె, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ సోదరి. మాయ UK బేయర్స్ బిజినెస్ స్కూల్, ది యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో తన విద్యను పూర్తి చేసింది. మాయ టాటా ప్రస్తుతం గ్రూప్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ఆమె టాటా ఆపర్చునిటీస్ ఫండ్తో తన వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని గ్రూప్ రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీకి ఆమె వెళ్లారు.
2011లో రతన్ టాటా చేత ప్రారంభించబడిన కోల్కతా ఆధారిత క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయ ప్రస్తుతం ఉన్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి రూ.11,20,545.24 కోట్లతో లిస్టెడ్ పెట్టుబడుల మార్కెట్ విలువతో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ.20,71,467 కోట్లుగా పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE