ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ అగ్రనేతలు, పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. వేడుకకు కొన్ని గంటల ముందు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు యోగి ఆదిత్యనాథ్ నివాసాన్ని సందర్శించారు, వీరిలో చాలా మందికి మంత్రి పదవులు లభించాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను బిజెపి శాసనసభ్యులు గురువారం ఎన్నుకున్నారు. ధర్మపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్భర్, జితిన్ ప్రసాద, రాకేష్ సచన్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ్ చౌదరి, జయవీర్ సింగ్ యూపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించింది. 37 ఏళ్ల తర్వాత ఇలా ఒకే పార్టీ రెండోసారి వరుసగా అధికారంలోకి రావడం ఒక రికార్డు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 సీట్లకు గాను బీజేపీ 255 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షాలైన అప్నా దళ్ (సోనేలాల్) 12 సీట్లు, నిషాద్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. గత ఐదేళ్లలో, యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరచడం ద్వారా బలమైన ప్రభుత్వాన్ని అందించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ