ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,407 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 15, తూర్పుగోదావరిలో 10, విశాఖపట్నంలో 7, పశ్చిమగోదావరిలో 3 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 55 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 25, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,33,81,540
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 10,515
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 23,19,407
- కొత్తగా నమోదైన కేసులు : 40
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 23,04,248
- యాక్టీవ్ కేసులు : 429
- మొత్తం మరణాల సంఖ్య : 14,730
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ