ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ప్రజలపై సామాజిక మాధ్యమాల ప్రభావం” అనే అంశం గురించి వివరించారు. ఆధునిక కాలంలో సాంకేతిక భావం చాలా బాగా పెంపొందిన సమయంలో ఎక్కడ ఏ కొత్త ఆలోచన వచ్చినా ప్రపంచమంతా వ్యాపిస్తుందని, అయితే అందులో సత్యం ఏంటనేది ఆలోచించకుండా బాగుంది అనుకునే ఎక్కువయ్యారని చెప్పారు. నేటి రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో అనేక అసత్యాలు ప్రచారం కావడం బాధాకరమన్నారు. ఆ అంశంపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇