తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి-2022 పరీక్షలను మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 5,09,275 మంది విద్యార్థులు హాజరకానున్నారు. ఈ నేపథ్యంలో హాల్ టికెట్స్ అంశంపై ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) తాజాగా కీలక ప్రకటన చేసింది.
హాల్-టికెట్లు మరియు ప్రింటెడ్ నామినల్ రోల్స్ నేడు (మే 11, బుధవారం) రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపబడ్డాయని, విద్యార్థులు తమ హాల్-టికెట్లను సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ నుండి తీసుకోవాలని సూచించారు. అలాగే మే 12నుండి హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. మే-2022 పదో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావడానికి ఈ వెబ్సైట్ నుండి కూడా విద్యార్థులు తమ హాల్-టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ