దక్షిణాఫ్రికాతో టి-20 సిరీస్ కు భారత జట్టు ఖరారు

2019 Latest Sport News, 2019 Latest Sport News And Headlines, BCCI announces for T20 series, BCCI announces for T20 series against South Africa, BCCI announces squad for T20 series, BCCI announces squad for T20 series against South Africa, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news, squad for T20 series against South Africa, T20 series against South Africa

సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచుల టి-20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 15 నుంచి టి-20 సిరీస్ మొదలవుతుంది, 15న ధర్మశాల, 18న మొహాలీ, 22న బెంగుళూరులో ఈ మ్యాచులను నిర్వహిస్తున్నారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో మహేంద్రసింగ్ ధోనికి జట్టులో చోటు కల్పించలేదు. ప్రపంచకప్ తరువాత విశ్రాంతిలో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లకు టి-20 లకు విశ్రాంతి నిచ్చారు. యువ ఆటగాళ్లు నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ ఈసీరీస్ లో బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు.ఇక టి-20 ల అనంతరం దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది.

భారతజట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =