ఇసుక కొరతపై టీడీపీ నిరసన కార్యక్రమాలు

AP Latest Political News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Nara Lokesh Conducts Protest Against Govt, Nara Lokesh Conducts Protest Against Govt Over Sand, Nara Lokesh Conducts Protest Against Govt Over Sand Crisis, Nara Lokesh Latest News, Nara Lokesh Latest Political Updates

రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేపట్టే నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని, 20 లక్షల మంది నిర్మాణ కార్యకర్తలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, 32 రకాల ఉపాధి అవకాశాలు కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నిరసన చేపడుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ మంగళగిరిలో ధర్నాకు దిగారు.

మంగళగిరిలో టీడీపీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టిన నారా లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగిందని నిలదీసారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఆగిపోవడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక కొరత వలన తమ కుటుంబాలు ఎదురుకుంటున్న ఇబ్బందులను నారా లోకేష్ కి వివరించారు. ఈ ధర్నాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్లకార్డులును ప్రదర్శించారు.

 

[subscribe]
[youtube_video videoid=kCc-tkbaa1I]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 3 =