న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా భారత్ జట్టు ఇప్పటికే ఆక్లాండ్ చేరుకుంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు భారత్ ఆడనుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్తో తలపడే భారత్ వన్డే, టీ20 జట్లను జనవరి 21, మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా శిఖర్ ధావన్ ఎడమ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 మ్యాచులకు ధావన్ ను ఎంపిక చేయలేదు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీ20 సిరీస్ కు ధావన్ స్థానంలో సంజు శాంసన్ ను, వన్డే సిరీస్కు పృథ్వీ షాను ఎంపిక చేసింది.
Home స్పోర్ట్స్
- Advertisement -