భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జూలై 1 నుంచి 5 వరకు ఐదవ రీషెడ్యూల్ టెస్ట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా నిర్ణయాత్మకమైన ఈ టెస్టుకు భారత్ జట్టులో కీలక మార్పు జరిగింది. ఇంగ్లాండ్ తో జూలై 1 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే 5వ టెస్టుకు భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవడంతో, జట్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో 1987 లో కపిల్ దేవ్ తర్వాత భారత్ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించిన పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ సృష్టించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. రోహిత్ శర్మ గురువారం ఉదయం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకున్నాడని, మళ్ళీ కోవిడ్ పాజిటివ్ గానే తేలిందని బీసీసీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ తో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా మరియు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్టుల టెస్ట్ సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ పై 3 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లాండ్ ఊపుమీదుండగా, ఈ టెస్టులో సత్తాచాటి సిరీస్ గెలుచుకునేందుకు భారత్ జట్టు సిద్ధమైంది.
భారత్ టెస్టు జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ , మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY