శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టు సభ్యులను ముప్పు తిప్పలు పెట్టె మలింగ 2011 లోనే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాడు, కాగా ఇటీవలే వన్డేల నుంచి కూడ రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. కొలంబోలో శుక్రవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్పై శ్రీలంక ఘన విజయం సాధించడంతో, లసిత్ మలింగ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన వీడ్కోలు వన్డే మ్యాచ్ లో కూడ 9.3 ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు, తన చివరి బంతికి వికెట్ సాధించి వన్డే కెరీర్ను ముగించాడు.
మలింగ తన కెరీర్లో 30 టెస్టులు ఆడాడు, 33.16 సగటుతో 101 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తరఫున 226 వన్డేలు ఆడాడు, దీనిలో అతను 28.87సగటుతో 338 వికెట్లు పడగొట్టాడు, 2007, 2011 క్రికెట్ ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో తొమ్మిదవస్థానంలో నిలిచాడు. తన కెరీర్లో 6/38 తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసాడు, మలింగ ఇప్పటివరకు 73 టి-20 మ్యాచులు కూడ ఆడాడు, టి-20 క్రికెట్లో 19.7 సగటుతో 97 వికెట్లు నమోదు చేశాడు, 2020 లో జరగబోయే టి-20 ప్రపంచ కప్లో జట్టుకు అందుబాటులో ఉంటాడు.
#ThankYouMalinga👑 pic.twitter.com/HYqCO0sx08
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 26, 2019