తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 496 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 25, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,98,621 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 205 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,90,897 కి చేరింది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.03 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,613 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ లో 341, రంగారెడ్డిలో 68, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 40, సంగారెడ్డిలో 15, ఖమ్మంలో 5, హనుమకొండలో 4, కరీంనగర్ లో 4, సూర్యాపేటలో 3, యాదాద్రి భువనగిరిలో 3, నిజామాబాదులో 2, మెదక్ లో 2, కామారెడ్డిలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 1, జనగామలో 1, జోగులాంబ గద్వాల్ లో 1, మహబూబ్ నగర్ లో 1, మంచిర్యాలలో 1, నల్గొండలో 1, పెద్దపల్లిలో 1 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY