తెలంగాణ రాష్ట్రంలో మరో 6876 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 2, సోమవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 70,961 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 59 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2476 కి పెరిగింది. కరోనా నుంచి మరో 7432 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,81,365 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(6876):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1029
- మేడ్చల్ మల్కాజిగిరి – 502
- నల్గొండ – 402
- రంగారెడ్డి – 387
- సూర్యాపేట – 372
- వరంగల్ అర్బన్ – 354
- కరీంనగర్ – 264
- సిద్దిపేట – 258
- ఖమ్మం – 235
- మహబూబ్ నగర్ – 229
- నిజామాబాద్ – 218
- పెద్దపల్లి – 218
- జగిత్యాల – 211
- నాగర్ కర్నూల్ – 190
- మంచిర్యాల – 188
- యాదాద్రి భువనగిరి – 183
- వికారాబాద్ – 171
- సంగారెడ్డి – 157
- మహబూబాబాద్ – 133
- వనపర్తి – 123
- భద్రాద్రి కొత్తగూడెం – 121
- కామారెడ్డి – 118
- ఆదిలాబాద్ – 113
- వరంగల్ రూరల్ – 109
- రాజన్న సిరిసిల్ల – 107
- జోగులాంబ గద్వాల్ – 96
- కొమరం భీం ఆసిఫాబాద్ – 84
- జయశంకర్ భూపాలపల్లి – 78
- జనగామ – 65
- నిర్మల్ – 58
- ములుగు – 44
- మెదక్ – 30
- నారాయణ్ పేట్ – 29
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ