బోయిన్పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్ ల కిడ్నాప్ కేసు ఇటీవల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 14 మందికి గురువారం నాడు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.
బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి ముందుగా ఏ1 గా ఉన్న భూమా అఖిలప్రియ సహా 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 22 న భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తాజాగా 14 మందికి బెయిల్ ఇవ్వడంతో, మరో ఆరుగురు జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉండడంతో వారికోసం పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ