దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,50,201 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 101 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,56,014 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,37,342 (1.25%) కు తగ్గాయి. గత 24 గంటల్లో కేరళ (4892), మహారాష్ట్ర (4787) మాత్రమే 1,000 కి పైగా కొత్త కేసులను నమోదు చేశాయి. అలాగే గత 24 గంటల్లో ఢిల్లీ, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, లద్దాఖ్, నాగాలాండ్, మిజోరం, అండమాన్ అండ్ నికోబర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
ఇక కొత్తగా 11,987 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,06,56,845 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.32 శాతం గానూ, మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 12,881 కేసులలో 86.61 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ