ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం

Centre Allocates Land to TRS Party for the Construction of Party Office at Delhi

తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని టిఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు అక్టోబర్ 9, శుక్రవారం నాడు లేఖ రాశారు. న్యూఢిల్లీ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయింపు పక్రియ ముగిసినందున త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిపి, త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =