జనవరి 13న సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీ

Andhra Pradesh Latest News, AP Breaking News, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, CM KCR And CM YS Jagan To Meet, KCR and YS Jagan Meeting, Mango News Telugu, Political Updates 2020, Telangana Breaking News, Telangana Political Updates 2020
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 13వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇంతకుముందే మూడు సార్లు కీలక సమావేశాలు జరిగాయి. హైదరాబాద్ లో జరగనున్న ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న కీలక సమయంలో సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. క్రితంసారి సమావేశమైనపుడే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వచ్చే సమావేశంలో చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశముంది. అలాగే తొమ్మిది, పదవ షెడ్యూల్ లోని సంస్థల యొక్క ఆస్తులు మరియు అప్పుల పంపకం, నదుల అనుసంధానం, గోదావరి జలాల తరలింపు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, తదితర అంశాలుపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =