“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజి ఒట్టి దగా, మోసమని అన్నారు. కరోనా సమయంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజి అంకెల గారడీ అని పేర్కొంటూ కొన్ని ఇంటర్నేషనల్ పత్రికల్లో వార్తల వచ్చాయంటూ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహార శైలి బాగోలేదని, కరోనా వలన ఆర్ధికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను బిచ్చగాళ్ళను చేస్తారా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
దుర్మార్గమైన విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు 20 కోట్ల రుణ పరిమితి పెంచి, అనేక ఆంక్షలు పెట్టిందన్నారు. ఈ ప్యాకేజీతో కేంద్రం తన పరువు తానే తీసుకుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలపై పెత్తనం చేయాలనుకోవడం ఎలా సమంజసమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దారుణంగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu