సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు పేర్లను సిఫార్సు చేసింది. బుధవారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. అనంతరం ఏడుగురు పేర్లను తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడుగురులో నలుగురు మహిళా జ్యుడిషియల్ ఆఫీసర్లు/మెంబెర్ ఉన్నారు.
తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన జ్యుడిషియల్ ఆఫీసర్ల వివరాలు:
- పి.శ్రీ సుధ
- సి.సుమలత
- జి.రాధారాణి
- ఎం.లక్ష్మణ్
- ఎన్.తుకారాంజీ
- ఎ.వెంకటేశ్వర రెడ్డి
- మాధవీ దేవి (జ్యుడిషియల్ మెంబెర్, ఐటీఏటీ)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ