పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్, ఫిరోజ్ పూర్ ఎంపీ సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నడవలేనంతగా తాగి ఉన్నందున లుఫ్తాన్స విమానం నుండి దించబడ్డారని సహ ప్రయాణీకులు చెప్పారంటూ కలవరపరిచే మీడియా నివేదికలు వస్తున్నాయన్నారు. దీనివలన విమానం 4 గంటలు ఆలస్యమైందని, అలాగే సీఎం భగవంత్ మాన్ ఆప్ జాతీయ సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారని అన్నారు. ఈ నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బంది పెట్టాయని, అవమానపరిచాయని అన్నారు.
“దిగ్భ్రాంతికరంగా తమ సీఎం భగవంత్ మాన్కి సంబంధించిన ఈ నివేదికలపై పంజాబ్ ప్రభుత్వం నోరు మెదపలేదు. ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ స్పష్టత ఇవ్వాలి. ఇది పంజాబీ మరియు జాతీయ గౌరవంతో ముడిపడి ఉన్నందున భారత ప్రభుత్వం తప్పనిసరిగా కలుగజేసుకోవాలి. సీఎం భగవంత్ మాన్ ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే, ఈ విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. 8 రోజుల తన జర్మనీ పర్యటనకు ముగించుకుని సీఎం భగవంత్ మాన్ ఆదివారం దేశానికి తిరిగొచ్చారు. సీఎం తిరుగుప్రయాణంలో ఈ ఘటన జరిగినట్టు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY