తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు రహదారులపై సీఎం కేసీఆర్ కేంద్రమంత్రితో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించడం, కల్వకుర్తి-హైదరాబాద్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరణ, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ, నిధులు, శ్రీశైలం రహదారి విస్తరణ, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిపై చర్చించి, సీఎం కేసీఆర్ గడ్కరీకి లేఖలు అందించినట్టు తెలుస్తుంది. మరోవైపు శనివారం రాత్రి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ